మంచీ చెడుకు మధ్య జరిగే సంఘర్షణను తెలియజేస్తూ, చివరికి మంచికే విజయం లభిస్తుందని సందేశం ఇస్తూ జనపదుల్లో నైతిక విలువలు పెంపొందించి, సన్మార్గ బాటను పయనింపజేసే ఉత్తమ ప్రయోజనం కోసం జనంలోని ఆట, పాట, మాటల నుండి పుట్టిందే జానపద నాటకం. జానపదుల కోసం జానపదులచే ప్రదర్శింపబడే దేశి రూపకం జానపద నాటకం. మార్గ రూపకాలు నియమాలతో, కేవలం సమాజంలోని విద్యావంతులకు మాత్రమే ఉద్దేశింపబడినవైతే, గ్రామీణ ప్రజల కోసం, వారివారి మాండలీకాల్లో వినోదం ప్రధానాశయంగా కలిగి, భక్తిభావం పెంపొందిస్తూ, నీతిని తెలియజేయడానికి ఉద్దేశింపబడినవి ఈ దేశి రూపకాలు (జానపద నాటకాలు). ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పద్ధతిలో, ఒక్కో పేరుతో ప్రదర్శించే కళారూపాలకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలతో ఆయా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వినోదంతో పాటు, విజ్ఞానాన్ని కలిగిస్తూ, చైతన్యవంతుల్ని చేస్తూ ముందుకు సాగిపోతోందీ జానపద నాటకం. ప్రాచీన కాలం నుండి ప్రజల జీవితంలో పెనవేసుకుపోయి, వారి సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రధాన భాగమైంది. జాతికి ప్రతీకగా నిలిచింది. ఆంధ్ర జానపద నాటకరంగం సుసంపన్నమైనదీ, వైవిధ్యభరితమైంది. తెలుగులో ఉన్నన్ని జానపద నాటక కళారూపాలు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ...
This is all about my Fashion...the term fashion describes my thoughts