Skip to main content

Posts

Showing posts from August, 2018

జానపద నాటకం

మంచీ చెడుకు మధ్య జరిగే సంఘర్షణను తెలియజేస్తూ, చివరికి మంచికే విజయం లభిస్తుందని సందేశం ఇస్తూ జనపదుల్లో నైతిక విలువలు పెంపొందించి, సన్మార్గ బాటను పయనింపజేసే ఉత్తమ ప్రయోజనం కోసం జనంలోని ఆట, పాట, మాటల నుండి పుట్టిందే జానపద నాటకం. జానపదుల కోసం జానపదులచే ప్రదర్శింపబడే దేశి రూపకం జానపద నాటకం. మార్గ రూపకాలు నియమాలతో, కేవలం సమాజంలోని విద్యావంతులకు మాత్రమే ఉద్దేశింపబడినవైతే, గ్రామీణ ప్రజల కోసం, వారివారి మాండలీకాల్లో వినోదం ప్రధానాశయంగా కలిగి, భక్తిభావం పెంపొందిస్తూ, నీతిని తెలియజేయడానికి ఉద్దేశింపబడినవి ఈ దేశి రూపకాలు (జానపద నాటకాలు). ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పద్ధతిలో, ఒక్కో పేరుతో ప్రదర్శించే కళారూపాలకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలతో ఆయా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వినోదంతో పాటు, విజ్ఞానాన్ని కలిగిస్తూ, చైతన్యవంతుల్ని చేస్తూ ముందుకు సాగిపోతోందీ జానపద నాటకం. ప్రాచీన కాలం నుండి ప్రజల జీవితంలో పెనవేసుకుపోయి, వారి సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రధాన భాగమైంది. జాతికి ప్రతీకగా నిలిచింది. ఆంధ్ర జానపద నాటకరంగం సుసంపన్నమైనదీ, వైవిధ్యభరితమైంది. తెలుగులో ఉన్నన్ని జానపద నాటక కళారూపాలు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ...

చిందు భాగవతులు

మాదిగ ఆశ్రిత కులాల్లో చిందు భాగవతులు ఒకరు. సమాజంలో సమాంతరంగా కులాలు ఉన్నాయి. బ్రాహ్మణుల నుంచి షెడ్యూల్డు కులాల వరకు పోషిత కులాలు, ఆశ్రిత కులాలు అనే విభజన ఉంది. మాదిగ కులానికి ఆరు ఆశ్రిత కులాలున్నాయి. అవి డొక్కలవారు, చిందు భాగవతులు, బైండ్లవారు, నులక చందయ్యలు, కిన్నెరవారు, మాష్టీలు. వీరు సంస్కృతీపరివాహకులు. వీరు నాట్యంలో, అభినయంలో, గాత్రంలో దిట్టలు. చిందు భాగవతాన్ని చిందు యక్షగానం అని కూడా పిలుస్తారు. లయబద్దంగా అడుగులు వెయ్యడాన్ని చిందు అంటారు. ఈ జానపద కళాకారులు తమ కళను ప్రదర్శించుకుంటూ ఊరూరా తిరుగుతూ తమ భుక్తిని గడుపుకుంటారు. తమ పోషకుల కులపురాణాలను, గోత్రాలను, వంశ వృక్షాలను, బిరుదులనూ వీరగాథల్లాగా గానం చేస్తూ ఉంటారు. చరిత్ర గర్భంలో మరుగున పడి ఉన్న వీరి జీవన విధానం మీ కోసం.. చిందు భాగవతులు మాదిగవారిని తప్ప వేరేవారిని ఆశించరు. జాంబపు రాణం వంటి కుల కథలను ప్రదర్శిస్తూ కులపురాణాలను వల్లెవేస్తూ మాదిగలకు వినోదాన్ని కలిగిస్తున్నారు. పల్లె ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ కళారూపాలు ప్రాచీనమైనవి. ఈ కళాకారులు ప్రజల నుంచి ఆశించేది పట్టెడన్నం, పాత వస్త్రాలు, భుక్తికి కాసిని కాసులు. యక్షగానం లేక చిందు...

దళిత సాహత్యానికి పుష్టి చేకూర్చిన 'మాదిగ' సాహిత్యం

తెలుగు సాహిత్యంలో గుర్రంజాశోవ మహాకవితో దళితసాహిత్యవాదం పునాదులు వేసుకొని కారంచెడు, చుండూరు, పదిరికుప్పం, నీరుకొండ లాంటి సంఘటనలతో చైతన్యమై మరింత ఊపునందుకొని అస్థిత్వ ఉద్యమాల ఉప్పెనలో ప్రస్తుతం పరిపుష్ఠిని అందుకొంటున్నది. దళితులు తమపై కుల, ధన, భాస్వామ్యపెత్తందార్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాహిత్యంలో తిరుగుబాటు స్వరాల(గొంతులు)ను చాలా గంభీరంగా వినిపించారు. తెలుగులో దళిత సాహిత్యకారులపై ప్రారంభంలోకాకపోయిన 80వ దశకంలో ప్రధానంగా కమ్యూనిస్టు దళితపాంథర్స్‌ ఉద్యమాల ప్రభావం గాఢంగా ఉంది. గుర్రం జాషువా, బోయభీమన్న, కుసుమ ధర్మన్న వంటి మొదటితరం కవులు పద్య, గేయ సాహిత్యాలలో ఎక్కువ కృషి చేస్తే, రెండవతరం దళిత సాహితీ కారులైన డాక్టర్‌ కొలకలూరి ఇనాక్‌, డాక్టర్‌ బోయ జంగయ్య, మాస్టర్జీ, డాక్టర్‌ ఎండ్లూరి సుధాకర్‌, మద్దూరి నగేష్‌ మొదలైన కవులు అన్ని సాహిత్య ప్రక్రియలలో తమగొంతును బలంగా వినిపిం చారు. ఆ తరువాత గత రెండు దశాబ్దాలుగా మాదిగ సాహిత్యకారులు సామాజికన్యాయ పునాదులపై గొంతెత్తి నినదిస్తూ విస్తృతంగా రచనలు చేశారు. మొత్తం సాహిత్యంపై తమదైన ముద్రను ప్రస్ఫుటంగా వేశారు. ఈ దశలో డాక్టర్‌ నాగప్పగారి సుందర్‌రాజు, గుండెడప్...

ఆంధ్రదేశంలో కులాల పుట్టుక – పెరుగుదల

క్రీ.శ. ౩౦౦ వరకు, అనగా శాతవాహనరాజ్యం చివరిరోజుల వరకు, వృత్తుల ప్రస్తావనే తప్ప కులం ప్రస్తావన దాదాపు లేదు. ధాన్యకటక బౌద్దస్తూపానికి ‘విధిక’ పేరుగల చెప్పులు కుట్టే వ్యక్తి కానుకలు సమర్పించినట్లు శాసనాధారం ఉంది. ఇతని తండ్రి ఉపాధ్యాయ. (బౌద్ద భిక్షువుకు ఒక పేరు) వీరిద్దరూ బౌద్ధులు. వైదిక, బౌద్దమతాలు పక్కపక్కనే సాగిన కాలమది. వారు వైదిక మతానుయాయులు. ౩వ శతాబ్ది మధ్యనుంచి ఆంధ్రదేశంలో ఆర్ధిక విప్లవం ఒకటి మొదలైంది. విదేశీ వ్యాపారం దాదాపు అంతమైంది. (రోమన్ సామ్రాజ్యం పతనం ఇందుకు ముఖ్యకారణం) పరిశ్రమలు మూలపడ్డాయి. ఇక్ష్యాకుల రాజధాని విజయపురిలో సైతం ఆనాటి పారిశ్రామిక అవశేషాలు కనపడవు. వ్యవసాయం వైపు దృష్టి మళ్ళింది. వాశిష్ట్టిపుత్ర చాంతమూల అను ఇక్ష్వకురాజు వేలాది నాగళ్ళను, పశువులను రైతులకు దానంచేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఆ పిమ్మట కృష్ణానదికి దిగువన ఉన్న పల్నాడు, వెలనాడు ప్రాంతం అంత కంచి పల్లవరాజుల పాలనకు లోనైంది. వారి పేరుతోనే పలనాడు అనే పేరు వచ్చింది. (పల్లవనాడు అని మొదటిపేరు) ఆ రాజులలో ఒకరు ‘కడువెట్టి’ అనే బిరుడుకలవాడు. ‘కడువెట్టి’ అనగా అడవులను నరికివేసినవాడు అని అర్థం. వ్యవసాయాన్ని ప్రోత్...

ఎవరు నిజమైన జాతి పిత -జాగో

జై భీం ! చిన్నప్పటి నుంచి పాటశాలలో మనకు అన్నింటికంటే ముందుగా నేర్పించేది మన జాతీయ నాయకుల గురించి అందులోనూ కరం చాంద్ మోహన్ దాస్ గాంధి గురించి. ఎందుకంటే మన అగ్రవర్ణాల వారికి మన పాత సామెత అయిన “మొక్కై వంగనిది మాని వంగున” చాలా తెలుసు అందుకే ఈ చిన్న వయసు నుంచే అంబేద్కర్ గురించి తెలియజేయ కుండ మిగతా అగ్రవర్ణాల నాయకుల గురించి నూరిపోస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికి కొనసాగుతుంది, దీనిని అధిగమించి మన దళిత విద్యావంతులు ఇప్పటికైనా ఈ కుట్రను లో భాగం కాకుండా మన భావితరానికి నిజ మైన నాయకులూ ఎవరో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు జాతి పిత ? ఎవరు జాతి పిత అని నిర్ధారించే ముందు భారత జాతి(భారత దేశం) యొక్క సాంఘీకంగ, ఆర్దికంగ,విద్యాపరంగ, రాజకీయ అంశాలను పరిశీలిద్దాం. ఈ విశాల భారత దేశాన్ని చాలా మంది పరిపాలించారు వారిలో మహమ్మదీయులు,ఆంగ్లేయులు, పోర్చుగీస్, ఫ్రెంచ్ వారు మరియు డచ్ వారు ముఖ్యులు. మహమ్మదీయులు భారత దేశానికి ఖురాన్ తొ మాత్రమె కాక కత్తులు, ఈటేలు తొ జయించి 700 సంవత్సరాలు పరిపాలించి భారత దేశంలో స్తిరపడ్డారు (ఈ స్తిరపడ్డ వారే భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ గ వేరుపడ్డారు.) ఆంగ్లేయులు భారత దేశానికి ...

‘మాదిగ’జాతి గొప్పదనం - జాగో

తెలుగు సాహిత్యానికి సుమారు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉంది. నన్నయ క్రీ.శ .11వ శతాబ్దంలో ఆంధ్ర మహా భారతాన్ని రాశాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ ఆంధ్ర మహా భారతాన్ని వర్ణా శ్రమ ధర్మ పరిరక్షణ కోసం రాశాడు ( ఆంధ్ర మహాభారతం-ఆది:1 - 6). వర్ణాశ్రమ ధర్మాలను పరిరక్షించటం నాటి పాలకుల విధి. ఆ వర్ణాశ్రమ ధర్మాలు హిందూ ధర్మాన్ని బోధించే మనుస్మృతి మొదలైన గ్రంథాలను అనుసరించి రూపొందినవి. అలాంటి వర్ణాశ్రమ ధర్మాల గురించి వివరించటంలో ప్రాచీన తెలుగు కవులు ‘మాదిగ’లను కూడా ‘శూద్రులు’గానే పరిగణించారు. బ్రాహ్మణ, క్షత్రియ ,వైశ్యులకు అసూయలేకుండా సేవచేయటమే శూద్రుల ధర్మమని మనుస్మృతి (1-91) స్పష్టం చేస్తుంది. ప్రధానంగా ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఆ భావజాలాన్ని విస్తరించే ప్రయత్నమే కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ఆధునిక సాహిత్యం చాలా వరకూ మానవీయ కోణంతో మాదిగ జీవితాలను వర్ణించింది. కనుక, తెలుగు సాహిత్యంలోని మాదిగల గురించి పురాణ, ప్రాచీన, ఆధునిక విభాగాలుగా విభజించుకుని పరిశీలించటం జరుగుతుంది. ఆయా కాలాలలో వెలువడిన వివిధ సాహిత్య ప్రక్రియలలో మాదిగల జీవితమెలా ప్రతిఫలించిందో ఈవ్యాసంలో వివరించే ప్రయత్నం చేస్తాను....

దళిత బిడ్డ సాహిత్యం

కథా వాతావరణం వృత్తి స్థలాలను బట్టి రావాలనే విషయం, ఉద్వేగాల స్థాయి కథావసరం నుంచి రూపొందాలనే నియమం చిలకూరి సాహిత్య సృజనలో అంతర్భాగాలు. వైయక్తిక కోణాన్ని నియంత్రిస్తూ, సామూహిక జీవితాన్ని దర్శింపజేయడం గొప్పగా తెలిసిన రచయిత చిలకూరి దేవపుత్ర.  ఇతని రచన కదిలే కెమెరా కాదు, బతుకు తాను నుంచి అవసరం మేరకు కత్తిరించిన ముక్క. ఎంతో స్నేహంగా సున్నితంగా ప్రేమగా చిరునవ్వుల్ని చిలికించే చిలకూరి దేవపుత్ర- సాహిత్య సృజనను సీరియస్‌గా తీసుకున్న వ్యక్తి. దళిత కథనీ, దళిత నవలనీ, దళిత మూలాల నుంచి రూపొందించి చూపిన తొలి తరం సృజనకారుల్లో ఆయనది అరుదయిన స్థానం. ఒకరకంగా అసలు సిసలు దళిత కథకూ, నవలకూ దారులు వెయ్యడంలో ముందడుగు వేసిన వ్యక్తి దేవపుత్ర. ఆధిపత్య సంస్కృతినీ, అమలులోని సాహిత్య వాతావరణాన్నీ చీల్చుకుంటూ ప్రత్యా మ్నాయ సాహిత్యం ఎలా ఉంటుందో చూపిన ఈ సాహితీవేత్త మరణం ఇటు దళిత బహుజన సాహిత్యానికీ అటు మొత్తం తెలుగు సాహిత్యానికీ తీరని లోటు. దళిత వాస్తవికతని సృజనీకరించటంలో దేవపుత్ర సాహిత్యం రెండు దశలుగా కనిపిస్తుంది. దళిత జీవితాన్ని వాస్తవికంగా చిత్రించిన దశ, ఇంకా ముందుకెళ్లి తాత్విక దృక్పథం నుంచి ఆవిష్కరించిన ...