జై భీం ! చిన్నప్పటి నుంచి పాటశాలలో మనకు అన్నింటికంటే ముందుగా నేర్పించేది మన జాతీయ నాయకుల గురించి అందులోనూ కరం చాంద్ మోహన్ దాస్ గాంధి గురించి. ఎందుకంటే మన అగ్రవర్ణాల వారికి మన పాత సామెత అయిన “మొక్కై వంగనిది మాని వంగున” చాలా తెలుసు అందుకే ఈ చిన్న వయసు నుంచే అంబేద్కర్ గురించి తెలియజేయ కుండ మిగతా అగ్రవర్ణాల నాయకుల గురించి నూరిపోస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటికి కొనసాగుతుంది, దీనిని అధిగమించి మన దళిత విద్యావంతులు ఇప్పటికైనా ఈ కుట్రను లో భాగం కాకుండా మన భావితరానికి నిజ మైన నాయకులూ ఎవరో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎవరు జాతి పిత ? ఎవరు జాతి పిత అని నిర్ధారించే ముందు భారత జాతి(భారత దేశం) యొక్క సాంఘీకంగ, ఆర్దికంగ,విద్యాపరంగ, రాజకీయ అంశాలను పరిశీలిద్దాం. ఈ విశాల భారత దేశాన్ని చాలా మంది పరిపాలించారు వారిలో మహమ్మదీయులు,ఆంగ్లేయులు, పోర్చుగీస్, ఫ్రెంచ్ వారు మరియు డచ్ వారు ముఖ్యులు. మహమ్మదీయులు భారత దేశానికి ఖురాన్ తొ మాత్రమె కాక కత్తులు, ఈటేలు తొ జయించి 700 సంవత్సరాలు పరిపాలించి భారత దేశంలో స్తిరపడ్డారు (ఈ స్తిరపడ్డ వారే భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ గ వేరుపడ్డారు.) ఆంగ్లేయులు భారత దేశానికి బైబిలు మరియు తుపాకీలు తొ వచ్చి వాళ్ళ సామ్రాజ్యాన్ని స్తాపించి 300 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు (150 సంవత్సరాలు వ్యాపార సంస్థగా మిగతా కాలం పరిపాలకులుగా.) వీరు మన దేశ సంపదనంతా కొల్లగొట్టారు కాని విద్య మరియు నాగరికత అభివృద్ధికి సహాయం చేసారు.మహమ్మదీయులు మరియు ఆంగ్లేయులు వారి వారి యెక్క మతమైన ఇస్లాం, క్రైస్తవం ను అభివృద్ధి చేసారు. ఎవరైతే చరిత్ర ను మరిచి పోయారో వాళ్ళు క్రొత్త చరిత్ర ను సృష్టించలేరు. మనము మన చరిత్రను తెలుసుకోవాలి అందులోని లోపాలును సరిదిద్ది ఇప్పటికి సరిపోయే క్రొత్త చరిత్రను మలచుకోవాలి. ఈ సందర్భంగా హరప్పా మరియు మొహంజదారో నాగరికతను పరిశీలిస్తే 4000 సంవత్సరాలైన సిందూ నది ఒడ్డున (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది) వెలిసినది. 1920 లో ఆంగ్లేయులు కనుగోనేనంత వరకు ఎవరికీ తెలియదు. ఆర్యులు వారి వేదం, యజ్ఞం, భలి లాంటి సాంప్రదాయాలతో వచ్చి పైన పేర్కొన్న నాగరికతను నాసనం చేసారు. మహమ్మదీయులు మరియు ఆంగ్లేయులు కాలంలో కూడా ఈ ఆర్యుల సంస్కృతి అయిన చతుర్ వర్ణాలైన బ్రాహ్మణ, క్చత్రియ, వైశ్య మరియు శూద్ర అనే వర్ణ వ్యవస్థను అలాగే ఈ వ్యవస్తను కంట్రోల్ చేసే మను శాస్త్రము, మను నీతిని నాసనం చేయలేక పోయాయి.
కుల వ్యవస్త:
మనందరికి తెలుసు మన భారత దేశము సువిశాలమైన గొప్ప దేశము. మన దెశ చరిత్ర ఎంత పాతదో వర్ణ వ్యవస్థ లైన అంటరాని తనం, తోటి మానవులను అవమానించడం లాంటివి కూడా అంటే పాతది. ఈ మను నీతి ఇప్పటికి కూడా మనదేశంలో కొన్ని ప్రాంతాలలో ఆచరణలో ఉంటూ వారి యొక్క జీవన విధానాలను ప్రభావితం చేస్తున్నాయి. “భిన్నత్వంలో ఎక్కత్వం” అని చెబుతుంటాం కాని ఈ వర్ణ వ్యవస్థ వివిధ జాతులను సమానంగా కాకుండా, అంటరానితనన్ని ప్రోత్సహిస్తు, విభేదాలను సృష్టిస్తూ మన యొక్క దైనందిన జీవితాన్ని నాసనం చేస్తున్నాయి. ప్రపంచంలో మనం అమెరికన్లు, ఆంగ్లేయులు, ఆస్ట్రేలియన్లు, రస్సియన్లు మరియు చైనీయులు మొదలైన వారు ఉన్నారని విన్నం అలాగే చూస్తున్నాం. అయితే మన దేశంలో భారతీయులుగా ఎవరు చెప్పుకోరు మొదట వారు ఎ కులస్తులో చెప్పు కొంటారు ఉదా! బ్రాహ్మణులూ, క్చత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు గ ఉంటున్నారు. వీటితో పాటు రెడ్డి , నాయుడు,గౌండర్, నాయకర్ , ముదలియర్ అనే ఎన్నో కులాలు గ కూడా ఉన్నాయి. మన దళితుల్లో కూడా ఎన్నో ఉప కులాలు ఉన్నాయి. ఇలాంటి ఒక కులాన్ని నిశితంగా పరిశీలిస్తే ఉధా. యాదవులు (తెలుగులో గొల్లవారు- పశువులను, గొర్రెలను పెంచి పోసించే వారు ) తమిళంలో ఇదైయర్ మద్రాసు హైకోర్ట్ లో ఒక వ్యాజ్యం వేసారు. హిందూ దేవతలలో ఒకడైన శ్రీకృష్ణుడు కూడా గోవులను కాశాడు కాబట్టి కోర్ట్ శ్రీకృష్ణుడిని యదవుడుగా గుర్తించాలని వీరి వాదన. అందుకే ఈ కులవ్యవస్త భారత దేశానికి ఒక క్యాన్సర్ లాంటిది అనడానికి ఇది ఒక ఉదాహరణ.
ప్రాంతీయతత్వం మరియు భాష: ప్రపంచంలో చాల దేశాలలో ఒకటి లేదా రెండు భాష ఉన్నాయి. ఇలా ఒకటికంటే ఎక్కువ భాష ఉన్నా పరిపాలనకు ఒకే ఒక భాష ఉంది. కాని మన భారత దేశం లో మరొక్క పెద్ద సమస్య ప్రాంతీయతత్వం మరియు భాష. మన దేశం లో సుమారుగ 30 రాష్త్రలు మరియు 28 భాషలు ఉన్నాయి. మనకు ఎ భారతీయుడైన ఎదురైనపుడు నీవు ఎవరని అడిగితె? వెంటనే వచ్చే బదులు నేను తెలుగు వాడిని, బెంగాలి, మళయాలి,గుజరాతి లేదా మరాఠీ. అంటే దీని అర్థం సంకుచిత భావం గల ప్రాంతీయతత్వం మరియు భాషభిమానం మనలను భారతీయులు అనే భావం నుంచి దూరం చేస్తుంది. ఎప్పుడూ చెప్పే తెలుగు గడ్డ ముద్దు భిడ్డ, లేదా మరాఠ గడ్డ ముద్దు భిడ్డ అన్న భావన మన జాతీయత అభివృద్ధిని కుంటు పడేటట్లు చేస్తుంది.
మతము:
ఈ ప్రపంచంలో మతం లేని దేశాన్ని, మానవాళిని ఊహించలేము. ఇక్కడ గుర్తించు కోవలసిన విషయం ఏమిటంటే మతము మనకొరకేగాని మనము మతము కొరకు కాదు. ప్రపంచ చరిత్రలో మనకు ఫ్రెంచ్ విప్లవం, రస్సియన్ విప్లవం మరియు పీసంట్ విప్లవం జరిగినది. ఈ విప్లవాలు మనవ జీవితాలను చాల ప్రభావితం చేయడమే గాక మతాల అభివృద్ధి మరియు మార్పుకు నాంది పలికింది. ఈ సమయంలో ఇలా మార్పుకు నాంది పలికిన మతాలు క్రైస్తవము,ఇస్లాం మరియు భౌద్ధ మతము. మత కలహాలు వళ్ళ ఐరోపాలో ప్రోతెస్తంట్ అనే క్రొత్త విభాగం క్రైస్తావంలో ఏర్పడినది. భారత దేశంలో కూడా హిందువులు మార్పును కోరుకొన్నారు. ఎలాంటి మార్పును కోరుకొన్నారు? మతకలహాల వాళ్ళ ఒరిగినది ఏమిటి? ఈ క్రింద చూద్దాం. హిందూ మతములో ప్రదానంగా రెండు భాగాలు ఒకటి శైవము-శివుని పూజించే వారు మరొకటి వైష్ణవము –విష్ణు దేవుణ్ణి పూజించేవారు. ఇందులో కూడా ఉపవిభాగాలు ఉత్తరాది-ఉత్తర భారత దేశంలో నివసించే వారు , ధక్షినాది-ధక్షిన భారత దేశంలో నివసించే వారు. ఈ ఇద్దరి మద్య మత పరమైన చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అలాగే ఈ వైరుధ్యం చాలా కాలం నుంచి ఉంటున్నాయి. ఈ వైరుధ్యానికి ప్రదాన కారణం ఏమిటంటే మందిరం ముందు ఉండే గజరాజు (ఏనుగు) కు వైష్ణవ తిలకమైన నామం పెట్టాలా లేదా శైవ తిలకమైన విభూది పెట్టాల అన్న విషయం మీద జరిగింది. ఇదే విషయం పై మద్రాసు హైకోర్ట్ లో ఒక వాజ్యం పై స్పందిస్తూ మొదటి ఆరు మాసాలు వైష్ణవ నామం మిగత ఆరు మాసాలు శైవ తిలకం పెట్టాలని తీర్పునిచ్చారు. మతము ఒక వ్యాది లాంటిది అది మనదేశాన్నే నాసనం చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ.
ఈ లాంటి భిన్న మతాలు, భాషలు, ప్రాంతాలున్న దేశానికి అందరకి అమోదయోగ్యమైన రాజ్యాంగమును రూపోందించుట సాధ్యమేనా? బయపడకండి నా అభిప్రాయాన్ని మీ పై బలవంతంగా రుద్దను? మొదట డా.బాబాసహాబ్ ఏమ్మన్నారో చూద్దాం ఒకసారి శ్రీ. M.O. మతై గారు I.C.S నెహ్రు గారి వ్యక్తిగత కార్యదర్శి మరియు తన మిత్రుడైన శ్రీ. పనిక్కర్, డా.బాబాసహాబ్ ఇంట్లో కలసిన సందర్భంలో మతై గారు , డా.బాబాసహాబ్ ను నెహ్రు గారి మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రి గ తీసుకోవాలనుకొంటున్నారు అన్నారట. వెంటనే , డా.బాబాసహాబ్ గారు చెప్పారు మీకు తెలుసా! హిందువులు వేదం కొరకు బ్రాహ్మణుడు కానటువంటి వ్యాసుడిని పిలిచారు. అలాగే రామాయణం కొరకు దళితుడైన వాల్మీకిని పిలిచారు. మరి ఇపుడు వారికి రాజ్యాంగం కావాలి కనుక దళితుడైన నా అవసరం వచ్చింది. దీనిలో ఆశ్చర్య పడవలసిన ఏమీ లేదు అన్నాడట.
డా.బాబాసహాబ్ అంబేద్కర్ ఎవరు?భారతదేశం లో ఎందరో మహాను భావులు ఉన్నారు అందులో అగ్రగణ్యుడు మరియు కారణ జన్ముడు మన డా.బాబాసహాబ్ అంబేద్కర్. తను ఒక అర్థికా శాస్త్రవేత్త, సంపాదకుడు, న్యాయకోవిదుడు, విద్యావేత్త, అనర్గళంగా మాట్లాడగలిగే వ్యక్త అంతే గాక భారత దేశంలో అంతంత మాత్రంగా ఉన్న భౌద్దమతానికి ఒక క్రొత్త ఒరవడిని సృష్టించిన మహోన్నతుడు. దెశ విదేశాలలోని వివిధ విధ్యాపీటాలు తనను గౌరవ డాక్టరేటుతో సత్కరించాయి. అన్నింటికంటే తను రాజ్యంగా నిర్మాతగ సుప్రసిద్దులు. ప్రపంచంలో ప్రసిద్దిగాంచిన 6 మేధావులలో అంబేద్కర్ ఒకరుగా ఆ కాలంలో గొప్పగ చెప్పుకొనేవారు. భరత మాత ముద్దుబిడ్డగ తను ఈ సమాజంలోని సాంగీక, సామాజిక, ఆర్ధిక, మత, విద్య మరియు రాజకీయ పరమైన అసమానతలను మరియు అటువంటి అసమానతలకు మూలమైన కారణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారు ఎవరైనా మనదేశంలో ఉన్నారంటే అది డా.బాబాసహాబ్ అంబేద్కర్ ఒక్కరు మాత్రమే! అటువంటి మహానుభావుడు మన రాజ్యాంగాన్ని వ్రాయడం మన అదృష్టం, తన యొక్క గొప్ప తనం రాజ్యంగం లోని ఉపోద్ఘాత ప్రకటన వాఖ్యాన్ని చదివితే తెలుస్తుంది.
“ భారత ప్రజలైన మేము భారత రాజ్యంగం ప్రసాదించిన ప్రతి పౌరుడి హక్కులు కాపాడుతాం, భారత దెశ సరబౌమత్వాన్ని కాపుడుతూ , ప్రతి పౌరుడికి ఆర్ధిక, సాంఘీక, సామాజిక అవకాశాలు సమానంగా అందేల చేసి ఈ జాతి యొక్క ఐక్యతకు తోడ్పడుతాం అని ప్రతిజ్ఞ చేస్తూ ఈ రాజ్యాంగాన్ని 26 నవంబరు 1949 జాతికి అంఖితం చేస్తున్నాం”.
పైన పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే డా.బాబాసహాబ్ అంబేద్కర్ రాజ్యంగా నిర్మాత మే కాదు తనే అసలైన జాతి పిత అని మనకు అర్తమవుతుంది.
Comments
Post a Comment