Skip to main content

జానపద కళారూపాలు - జాగో

పరవశించి ఆనందంతో మానవుడు కూని రాగాలు తీసినవుడు సంగీతం ఉద్భవించింది. శారీరక శ్రమ సం దర్భంలో పనికి, వినోదానికి మధ్య ఏర్పడిన పాటలే సంగీత కళగా గుర్తింపు పొందాయి.మనసులోని భావాల్ని మాటల రూపంలో వ్యక్తంచేయగా కవిత్వం ఏర్పడింది.. విగ్రహాల్ని ప్రతిమల్ని చెక్కగా శిల్పం అయింది. విగ్రహారాధన ద్వారా విగ్రహ శిల్పం, గృహ నిర్మాణం ద్వారా సౌధశిల్పం ప్రసిద్ధి చెందాయి. ఆనందంలో చిందులు తొక్కడం వల్ల నాట్యకళ ఉద్భవించింది.

కళ అనంతమైనది, విశ్వజనీనమైనది. పండిత పామరులను సైతం వరవశింపజేసేది కళ. సృష్టిలో చూసి ఆనందించి, అనుభవించిన ప్రకృతి సౌందర్యాన్ని మానవుడు సృష్టి చేయడంతో కళ ఆవిర్భవించింది. మానవ సంస్కృతిని ప్రతిబింబించేవి కళలు. ప్రాచీనకాలంలో కళ జీవితంలో భాగంగా ఉండేది. భరతుని నాట్యశాస్త్రంలోనూ, వాత్స్యాయనుని కామ సూత్రాల్లోనూ చతుషష్టి (64)కళలు పేర్కొనబడ్డాయి. అందువల్ల సౌందర్యాత్మకం గా ఓర్పుతో, నేర్పుతో చేసేవి కళలుగా భావించవచ్చు. మాధుర్యమైన 64 కళల్లో లలిత కళలు ఉత్తమమైనవి. తెలంగాణలో జనపద కళలు అధిక ప్రాశస్త్యాన్ని పొందాయి. ఈ జానపద కళారూపాలను కులవృత్తులుగా చేసుకొని వాటిద్వారా జీవనం కొనసాగిస్తున్నవారున్నారు.మానవుని జ్ఞాన సముపార్జనకు పం చేంద్రియాలు ఎంతముఖ్యమో సంస్కృతిలో జానపద, లలితకళలు కూడా అంతే ముఖ్యం.

లలిత కళల్ని ఆంగ్లంలో సమానార్థకంగా ఫైన్‌ఆర్ట్స్‌గా పిలుచుకుంటున్నాం. లలిత కళలు 5 అంశాలతో ముడిపడి హృదయానికి ఆనందాన్ని కల్గిస్తాయి. అవి 1. సంగీతం, 2.సాహిత్యం, 3.నృత్యం(నాట్యం), 4.చిత్రకళ(చిత్రలేఖనం), 5.శిల్పం. నిజానికి ఈ ఐదు అంశాలే ఒక జాతి సంస్కృతిని తెలియజేస్తాయి. వీటితో మానవునికి అవినాభావ సంబంధం ఉంది. పరవశించి ఆనందంతో మానవుడు కూని రాగాలు తీసినవుడు సంగీతం ఉద్భవించింది. శారీరక శ్రమ సం దర్భంలో పనికి, వినోదానికి మధ్య ఏర్పడిన పాటలే సంగీత కళ గా గుర్తింపు పొందాయి. మనసులోని భావాల్ని మాటల రూపం లో వ్యక్తంచేయగా కవిత్వం ఏర్పడింది.

మానవుడు నీరు పట్టుకోవడానికి కుండలు తయారుచేసేటపుడు వివిధ రకాల బొమ్మ ల ఆధారంగా వివిధ ఆకృతులు, రకరకాల ఆకారాల్లో కుండల్ని తయారుచేసుకున్నారు. చిత్రకళ ఆవిర్భావానికి ఇదే నాందిగా చెప్పవచ్చు. విగ్రహాల్ని ప్రతిమల్ని చెక్కగాశిల్పంఅయింది. విగ్రహారాధన ద్వారా విగ్రహ శిల్పం, గృహ నిర్మాణం ద్వారా సౌధశిల్పం ప్రసిద్ధి చెందాయి. ఆనందంలో చిందులు తొక్కడం వల్ల నాట్యకళ ఉద్భవించింది. సర్వలలితకళల సమాహారం నాట్యకళగా చెప్పకోవచ్చు.ఈ కళను రేఖా రూపంలోనో, వర్ణరూపంలోనో లేదా ధ్వని, హావభావ, లయాత్మక చలన రూపంలోనో అభివ్యక్తం చేయడం జరుగుతుంది. జానపద కళలకు తెలంగాణ పుట్టినిల్లు. ఈ జనపద కళల్ని అధ్యయనం చేయడం వల్ల మానవ వికాసం, నాగరికత స్వరూపం తెలుసుకునే వీలుంటుంది.

వీధి భాగవతం:

దీన్నే తెలంగాణలో వీధి బాగోతంఅని పిలుస్తారు. ఈ కళారూపాల్ని తెలుగులో వీధి నాటకం/వీధిభాగవతం/చెంచునాటకం/యక్షగానం అని పిలుస్తారు. ఇవి ప్రాంతీ య విశిష్టలతో కూడి సామాన్య ప్రజలను రంజింపజేసిన అద్భు త జానపద కళా రూపాలు. ఈ వీధి నాటకాలకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నది. ప్రాచీన కళారూపాల్లో యక్షగానం విశిష్టమైనదని చెప్పవచ్చు. యక్షగానాలకు అనుకరణగా ఏర్పడిన కళారూపమే వీధినాటకం. వీధి నాటకాలు సాహిత్యంలోను, చరిత్రలోనూ, ప్రముఖమైన సన్నివేశాలు ఆవిష్కరించ బడ్డాయి. ప్రాక్‌నన్నయ యుగం మొదలు గోల్కొండ నవాబుల కాలం నుంచి ప్రదర్శింపబడుతున్నాయి.

చిందు భాగవతం/పగటి భాగవతులు/సింది బాగోతులు:

వీరిని చిందులుగా పిలుచుకుంటాం. వీరు కేవలం హరిజనులను ఆశ్రయించుకొని ఊరి చివర చిన్న పందిరి వేసి ప్రదర్శనలిస్తారు. రామాయణ, భారత, భాగవత కళల్ని నృత్యనాటకాలుగా ప్రదర్శించడం ఈ కళాకారుల ప్రత్యేకత. ఈ కళా ప్రదర్శనలో పురుషులు, స్త్రీలు ఇద్దరూ పాల్గొంటారు. వీరు మోహినీ రుక్మాంగద, సారంగధర, చెంచులక్ష్మీ వీరాభిమన్యు, సుందరకాండ, సతీసావిత్రి, మైరావణ మొదలగు నాటకాలు ప్రదర్శిస్తారు.

భజన మండలులు:

నిజామాబాద్ జిల్లా ప్రతీ గ్రామంలో కనీసం ఒక్క భజన మండలినైనా చూడవచ్చు. పట్టణంలో వాడవాడల్లో భజన మండలులు కన్పిస్తాయి. భజనలందు దేవి, దేవతల గూర్చి, వేదాంత తత్త్వములను గూర్చి కీర్తనలు, పాటలు, పద్యాలు ఒకరు చేస్తే మిగతావారు భక్తులు కలిసి పాడుతారు. భజనలందు తాళ మృదంగములు, తబలా, హార్మోనియం, ఏకతార, చిరుతలు, డక్కీలు వాడుతారు.
వండరి భజనలు: సుమారు 40 ఏళ్ల కిందట ఉచ్ఛస్థితిలో ఉన్న ఈ భజనలు ప్రస్తుతం ఆదరణ కోల్పోయాయి. ఈ కళా రూపంలో 40-50 మంది వ్యక్తులు నొసటపట్టే నామం దిద్దుకొ ని పట్టు వస్త్రం మడికట్టుగా కట్టుకొని తాళమృదంగంలు వాద్యములుగా కాళ్ళగజ్జెలు, గల్లగల్లుమని పాట కనుగుణంగా చేతులను తిప్ప తూ నాట్యం చేస్తూ తిరుగుతూ ఉంటారు.

గంగిరెద్దులాట:

ఇది తెలంగాణలో చక్కని జానపద కళ. సం క్రాంతి పండగలో ఈ కళాకారులకు అధిక ప్రాధాన్యం ఉంటుం ది. సాధారణంగా పూజగొల్ల కులానికి చెందినవారు గంగిరెద్దులను ఆడిస్తారు. ఎద్దును అలంకరించి ఊళ్ళలోతిరుగుతూ దాన్ని ఆడిస్తూ యాచించడం వీరి వృత్తి. ఒక గంగిరెద్దుతో పాటు ముగ్గు రు వ్యక్తులు ఉంటారు. వీరిలో ఒకరు గంగిరెద్దును ఆడిస్తే, మరోవ్యక్తి డోలు వాయిస్తాడు. మూడవ వ్యక్తి సన్నాయి వాయిస్తాడు. గంగిరెద్దుల మేళంలో ఉపయోగించే వాద్యాలు డోలు, బూర, సన్నాయి ఉంటాయి.

ఒగ్గుకథ:

తెలంగాణలో విశేషంగా ఆకర్షింపబడుతున్న జానపదకళ. ఇది కుర్మ కులానికి చెందినవారు (కుర్మ, గొల్లవారు) ప్రదర్శించే కళారూపం. శివుని వాద్యమైన డమరుకానికి ఒగ్గు కథకులు ఒగ్గుగా పిలుస్తారు. ఈ ప్రదర్శనలో ఒగ్గు వాద్యంతో పాటు డోలు, తాళాలు మొదలగు వాద్యాలు ఉపయోగిస్తారు. వాటితో పాటు కట్లకోల, చేతి రుమాలు, గజ్జెలు ప్రదర్శనలో ఉపయోగిస్తారు. ఈ కథ చెప్పేవారిని ఒగ్గోళ్లుగా పిలుచుకుంటాం. ఈ ప్రదర్శనలో ఐదారుగురు పాల్గొంటారు. వారిలో ఇద్దరు ప్రధాన కథకులు వారిలో ఒకరు స్త్రీ వేషం ధరిస్తారు. వారు కథ ను కొంతసేపు చెప్పి వాద్యాన్ని వాయిస్తూ ఉండగా పాత్రధారులు నృత్యాన్ని చేస్తూ ప్రేక్షకులను అలరించడం జరుగుతుంది.

పిచుకుంట్ల/పిచ్చుకగూళ్లు:

వీరి మూలదైవం శ్రీశైలమల్లికార్జునుడు. వీరు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కన్పిస్తారు. వీరి లో గంట, తురక, మంద, తిత్తి, తోగ మొదలగు ఉపజాతులున్నా యి. తెలంగాణ ప్రాంతంలో బాలనాగమ్మ, కామమ్మ, హరిశ్చంద్రుడు, సూర్యచంద్ర రాజులు మొదలగు కథలు చెబుతారు. రాయలసీమ ప్రాంతంలో కుంటిమల్లారెడ్డి కథ, నెల్లూరు, గుం టూరు ప్రాంతాల్లో పల్నాటివీర గాథలు, కాటమరాజు కథలు చెప్తారు.

కోలాటాలు:

ఐదు, ఆరు దశాబ్దాలకు పూర్వం అనేక గ్రామా ల్లో కోలాటం ఆటలు ఎక్కువగా కన్పించేవి. ప్రస్తుతం అక్కడక్కడ మారుమూల గ్రామాలలో మాత్రమే ఉన్నాయి. ఈ ఆటలో ఒక కృష్ణుని వేషం. చాలా మంది గోపికల వేషాలు వేసి సంవాద రూపముగా కృష్ణగోపికల లీలలు ప్రదర్శిస్తారు. ఈ ఆటలో జడకొప్పు, పద్మకొప్పు, నావలకొప్పు, కుంభకొప్పు, దేవతాకొప్పు, మయూర కొప్పు వంటి కోలాట ఆటలు చూడవచ్చు.
బుడగ జంగాలు: వీరు శివభక్తులు. ఒక చేతిలో గంట వాయి స్తూ శివుడి గూర్చి యక్షగానం చేస్తూ భిక్షాటన చేస్తారు. వినసొంపైన జానపద పాటలు పాడుతూ, విభూతిని పంచుతూ జీవనం కొనసాగిస్తారు. వీరినే జంగమ దేవర అని కూడా పిలుస్తాం.

శారద కాండ్రు:

వీరు శారద అనే పేరుగల వాద్యాన్ని ఉపయోగించడం వల్ల శారదకాండ్రుగా పిలుస్తారు. తాంబూరను శారద అని పిలుస్తారు. వీరి పాటల్లో అంత్యప్రాస నియమం ఉంటుం ది. గేయాలకన్నా సంగీతం ఎక్కువగా ఉంటుంది. ప్రధాన కథకుడు శారద అనే వాద్యాన్ని భుజం మీద ధరించి ఎడమచేతి బొటనవేలికి అందెలు ధరించి, భుజం పైనున్న తాంబురాను మీటుతూ కథాగానం చేస్తాడు.

వీరముష్టివారు:

ముష్టి అనగా పిడికిలి. వీరులు అనగా శైవ భక్తులు అని అర్థం. దీనిని బట్టి వీరముష్టి అనగా శైవభిక్షకులు అని అర్థం. వీరిని వీరభట,భద్రపాద అనే పేర్లతో పిలుస్తారు. వీరు కోమట్లను, జంగాలను ఆశ్రయించి జీవిస్తారు. వీరు వైశ్యుల ఆరాధ్యదైవమైన కన్యకాపరమేశ్వరి పాటలు పాడుతారు. వీరు నాట్యం చేసేటపుడు ఎరువురంగు బట్టలను, కాళ్లకు గజ్జెలు, మెడలో జబ్బలకు రుద్రాక్షమాలలు అలంకరించుకొని నుదుట గంభీరమైన విభూతి రేఖలు దిద్దుకుంటారు. వీరి స్త్రీలు చాపలు అల్లడం. పచ్చబొట్ల పొడవడం వంటి పనులు చేస్తారు. వీరి మరో ప్రత్యేకత బ్రాహ్మణులు, వైశ్యులు, బలిజలు వండిన అన్నం మాత్రమే భుజిస్తారు. అనగా వీరు శాకాహారులు.

బహురూపులవారు:

వీరు తెలంగాణ ప్రాంతంలో కోకొల్లలుగా కన్పిస్తారు. వీరు పగటి పూటనే అనేక చిత్ర విచిత్ర వేషాలు ధరించి ఇల్లిల్లు తిరుగుతూ జీవనం సాగిస్తారు.

సాధనశూరులు:

వీరు పద్మశాలీలను ఆశ్రయించి జీవిస్తారు. వీరు సాముగారడీలతో పాటు ఇంద్రమహేంద్ర జాలాలను, గారడీ ట్రిక్కులను చేసి చూపిస్తారు. చివరి ఘట్టమున పందిరిలో చక్కని పీఠము దానిపై అనేక దేవతల విగ్రహాలు, కలశము, టెంకాయ, వెలుగుచున్న మంగళహారతి, వేడివేడి పులిహోర నైవేధ్యం అమర్చివుండే కనికట్టు చేసి చూపిస్తారు.

బుడబుక్కలవాళు:

వీరు సంచార జాతికి చెందినవారు. సాధారణంగా వీరు క్షుద్రదేవతలను పూజిస్తారు. తెల్లవారు జామున విచిత్ర వేషధారణతో డమరుకం వాయిస్తూ గ్రామాల్లో వీధుల వెంట తిరుగుతారు. జ్యోతిష్యం చెబుతూ, తాయత్తులు కడుతూ యాచిస్తారు.

అసాదులు:

ప్రజలకు అనేక గ్రామ దేవతలను పూజించే ఆచారం ఉంది. వీరు ప్రకృతి దేవతలను పూజిస్తారు. ఎల్లమ్మ పోచమ్మ, నల్లపోచమ్మ, పెద్దమ్మ పేర్లతో దేవతలను పూజిస్తారు. ఈ అసాదులు అమ్మవార్లను తాంత్రిక పద్ధతిలో పూజిస్తారు. మాల కులంలో మాలదాసరులు ఉన్నట్లుగానే మాదిగ కులంలో అసాదులనే తెగకు చెందినవారు ఉంటారు. అసాదులంటే మాల, మాదిగ కులాల్లో పూజారి వర్గానికి చెందినవారని ఆరుద్ర పేర్కొన్నారు. వీరు ప్రధానంగా ఎల్లమ్మ కథను గానం చేస్తారు.

పిట్టల దొర:

తెలంగాణలో ఆదరణ ఉన్న మరో ముఖ్యమైన జానపద కళారూపం పిట్టలదొర. ఈ వేషాన్నే లత్కోర్ సాబ్, బుడ్డర్ఖాన్, తుపాకి రాముడుగా పేర్కొంటారు. ఇది పగటి వేషాల్లో ఒక రకానికి చెందింది. పిట్టలదొర వేషగాళ్లు సమాజంలోని లోపాలు, కుతంత్రాలను హాస్యాత్మకంగా, వ్యంగ్య రూపంలో చెబుతారు. ఖాకీ ప్యాంటు లేదా నిక్కరు, చిరిగిన ఖాకీ షర్టు, తలపై దొర టోపీ, కాళ్లకు బూట్లు ధరిస్తారు. టోపీపై ఒక పక్కన తెల్లటి ఈక, చేతిలో కట్టె తుపాకీ ఉంటుంది. వీరు తమ వాగ్దోరణితో ప్రజలను అలరిస్తారు.

కాటి కాపరులు:

వీరు దహన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు స్మశానంలో అన్ని ఏర్పాట్లు చేస్తారు. మరణించిన వారి గురించి కీర్తిస్తూ పాటలు పాడటం ద్వారా యాచిస్తారు.

Comments

Popular posts from this blog

‘మాదిగ’జాతి గొప్పదనం - జాగో

తెలుగు సాహిత్యానికి సుమారు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉంది. నన్నయ క్రీ.శ .11వ శతాబ్దంలో ఆంధ్ర మహా భారతాన్ని రాశాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ ఆంధ్ర మహా భారతాన్ని వర్ణా శ్రమ ధర్మ పరిరక్షణ కోసం రాశాడు ( ఆంధ్ర మహాభారతం-ఆది:1 - 6). వర్ణాశ్రమ ధర్మాలను పరిరక్షించటం నాటి పాలకుల విధి. ఆ వర్ణాశ్రమ ధర్మాలు హిందూ ధర్మాన్ని బోధించే మనుస్మృతి మొదలైన గ్రంథాలను అనుసరించి రూపొందినవి. అలాంటి వర్ణాశ్రమ ధర్మాల గురించి వివరించటంలో ప్రాచీన తెలుగు కవులు ‘మాదిగ’లను కూడా ‘శూద్రులు’గానే పరిగణించారు. బ్రాహ్మణ, క్షత్రియ ,వైశ్యులకు అసూయలేకుండా సేవచేయటమే శూద్రుల ధర్మమని మనుస్మృతి (1-91) స్పష్టం చేస్తుంది. ప్రధానంగా ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఆ భావజాలాన్ని విస్తరించే ప్రయత్నమే కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ఆధునిక సాహిత్యం చాలా వరకూ మానవీయ కోణంతో మాదిగ జీవితాలను వర్ణించింది. కనుక, తెలుగు సాహిత్యంలోని మాదిగల గురించి పురాణ, ప్రాచీన, ఆధునిక విభాగాలుగా విభజించుకుని పరిశీలించటం జరుగుతుంది. ఆయా కాలాలలో వెలువడిన వివిధ సాహిత్య ప్రక్రియలలో మాదిగల జీవితమెలా ప్రతిఫలించిందో ఈవ్యాసంలో వివరించే ప్రయత్నం చేస్తాను....

చిందు భాగవతులు

మాదిగ ఆశ్రిత కులాల్లో చిందు భాగవతులు ఒకరు. సమాజంలో సమాంతరంగా కులాలు ఉన్నాయి. బ్రాహ్మణుల నుంచి షెడ్యూల్డు కులాల వరకు పోషిత కులాలు, ఆశ్రిత కులాలు అనే విభజన ఉంది. మాదిగ కులానికి ఆరు ఆశ్రిత కులాలున్నాయి. అవి డొక్కలవారు, చిందు భాగవతులు, బైండ్లవారు, నులక చందయ్యలు, కిన్నెరవారు, మాష్టీలు. వీరు సంస్కృతీపరివాహకులు. వీరు నాట్యంలో, అభినయంలో, గాత్రంలో దిట్టలు. చిందు భాగవతాన్ని చిందు యక్షగానం అని కూడా పిలుస్తారు. లయబద్దంగా అడుగులు వెయ్యడాన్ని చిందు అంటారు. ఈ జానపద కళాకారులు తమ కళను ప్రదర్శించుకుంటూ ఊరూరా తిరుగుతూ తమ భుక్తిని గడుపుకుంటారు. తమ పోషకుల కులపురాణాలను, గోత్రాలను, వంశ వృక్షాలను, బిరుదులనూ వీరగాథల్లాగా గానం చేస్తూ ఉంటారు. చరిత్ర గర్భంలో మరుగున పడి ఉన్న వీరి జీవన విధానం మీ కోసం.. చిందు భాగవతులు మాదిగవారిని తప్ప వేరేవారిని ఆశించరు. జాంబపు రాణం వంటి కుల కథలను ప్రదర్శిస్తూ కులపురాణాలను వల్లెవేస్తూ మాదిగలకు వినోదాన్ని కలిగిస్తున్నారు. పల్లె ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ కళారూపాలు ప్రాచీనమైనవి. ఈ కళాకారులు ప్రజల నుంచి ఆశించేది పట్టెడన్నం, పాత వస్త్రాలు, భుక్తికి కాసిని కాసులు. యక్షగానం లేక చిందు...

ఆంధ్రదేశంలో కులాల పుట్టుక – పెరుగుదల

క్రీ.శ. ౩౦౦ వరకు, అనగా శాతవాహనరాజ్యం చివరిరోజుల వరకు, వృత్తుల ప్రస్తావనే తప్ప కులం ప్రస్తావన దాదాపు లేదు. ధాన్యకటక బౌద్దస్తూపానికి ‘విధిక’ పేరుగల చెప్పులు కుట్టే వ్యక్తి కానుకలు సమర్పించినట్లు శాసనాధారం ఉంది. ఇతని తండ్రి ఉపాధ్యాయ. (బౌద్ద భిక్షువుకు ఒక పేరు) వీరిద్దరూ బౌద్ధులు. వైదిక, బౌద్దమతాలు పక్కపక్కనే సాగిన కాలమది. వారు వైదిక మతానుయాయులు. ౩వ శతాబ్ది మధ్యనుంచి ఆంధ్రదేశంలో ఆర్ధిక విప్లవం ఒకటి మొదలైంది. విదేశీ వ్యాపారం దాదాపు అంతమైంది. (రోమన్ సామ్రాజ్యం పతనం ఇందుకు ముఖ్యకారణం) పరిశ్రమలు మూలపడ్డాయి. ఇక్ష్యాకుల రాజధాని విజయపురిలో సైతం ఆనాటి పారిశ్రామిక అవశేషాలు కనపడవు. వ్యవసాయం వైపు దృష్టి మళ్ళింది. వాశిష్ట్టిపుత్ర చాంతమూల అను ఇక్ష్వకురాజు వేలాది నాగళ్ళను, పశువులను రైతులకు దానంచేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఆ పిమ్మట కృష్ణానదికి దిగువన ఉన్న పల్నాడు, వెలనాడు ప్రాంతం అంత కంచి పల్లవరాజుల పాలనకు లోనైంది. వారి పేరుతోనే పలనాడు అనే పేరు వచ్చింది. (పల్లవనాడు అని మొదటిపేరు) ఆ రాజులలో ఒకరు ‘కడువెట్టి’ అనే బిరుడుకలవాడు. ‘కడువెట్టి’ అనగా అడవులను నరికివేసినవాడు అని అర్థం. వ్యవసాయాన్ని ప్రోత్...