మంచీ చెడుకు మధ్య జరిగే సంఘర్షణను తెలియజేస్తూ, చివరికి మంచికే విజయం లభిస్తుందని సందేశం ఇస్తూ జనపదుల్లో నైతిక విలువలు పెంపొందించి, సన్మార్గ బాటను పయనింపజేసే ఉత్తమ ప్రయోజనం కోసం జనంలోని ఆట, పాట, మాటల నుండి పుట్టిందే జానపద నాటకం. జానపదుల కోసం జానపదులచే ప్రదర్శింపబడే దేశి రూపకం జానపద నాటకం. మార్గ రూపకాలు నియమాలతో, కేవలం సమాజంలోని విద్యావంతులకు మాత్రమే ఉద్దేశింపబడినవైతే, గ్రామీణ ప్రజల కోసం, వారివారి మాండలీకాల్లో వినోదం ప్రధానాశయంగా కలిగి, భక్తిభావం పెంపొందిస్తూ, నీతిని తెలియజేయడానికి ఉద్దేశింపబడినవి ఈ దేశి రూపకాలు (జానపద నాటకాలు). ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పద్ధతిలో, ఒక్కో పేరుతో ప్రదర్శించే కళారూపాలకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలతో ఆయా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వినోదంతో పాటు, విజ్ఞానాన్ని కలిగిస్తూ, చైతన్యవంతుల్ని చేస్తూ ముందుకు సాగిపోతోందీ జానపద నాటకం. ప్రాచీన కాలం నుండి ప్రజల జీవితంలో పెనవేసుకుపోయి, వారి సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రధాన భాగమైంది. జాతికి ప్రతీకగా నిలిచింది. ఆంధ్ర జానపద నాటకరంగం సుసంపన్నమైనదీ, వైవిధ్యభరితమైంది. తెలుగులో ఉన్నన్ని జానపద నాటక కళారూపాలు ప్రపంచంలో ఎక్కడా లేవంటే ...
మాదిగ ఆశ్రిత కులాల్లో చిందు భాగవతులు ఒకరు. సమాజంలో సమాంతరంగా కులాలు ఉన్నాయి. బ్రాహ్మణుల నుంచి షెడ్యూల్డు కులాల వరకు పోషిత కులాలు, ఆశ్రిత కులాలు అనే విభజన ఉంది. మాదిగ కులానికి ఆరు ఆశ్రిత కులాలున్నాయి. అవి డొక్కలవారు, చిందు భాగవతులు, బైండ్లవారు, నులక చందయ్యలు, కిన్నెరవారు, మాష్టీలు. వీరు సంస్కృతీపరివాహకులు. వీరు నాట్యంలో, అభినయంలో, గాత్రంలో దిట్టలు. చిందు భాగవతాన్ని చిందు యక్షగానం అని కూడా పిలుస్తారు. లయబద్దంగా అడుగులు వెయ్యడాన్ని చిందు అంటారు. ఈ జానపద కళాకారులు తమ కళను ప్రదర్శించుకుంటూ ఊరూరా తిరుగుతూ తమ భుక్తిని గడుపుకుంటారు. తమ పోషకుల కులపురాణాలను, గోత్రాలను, వంశ వృక్షాలను, బిరుదులనూ వీరగాథల్లాగా గానం చేస్తూ ఉంటారు. చరిత్ర గర్భంలో మరుగున పడి ఉన్న వీరి జీవన విధానం మీ కోసం.. చిందు భాగవతులు మాదిగవారిని తప్ప వేరేవారిని ఆశించరు. జాంబపు రాణం వంటి కుల కథలను ప్రదర్శిస్తూ కులపురాణాలను వల్లెవేస్తూ మాదిగలకు వినోదాన్ని కలిగిస్తున్నారు. పల్లె ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ కళారూపాలు ప్రాచీనమైనవి. ఈ కళాకారులు ప్రజల నుంచి ఆశించేది పట్టెడన్నం, పాత వస్త్రాలు, భుక్తికి కాసిని కాసులు. యక్షగానం లేక చిందు...